- కొత్త మెడికల్ కాలేజీలు.. 15న ప్రారంభం
- 9 కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి తరగతులు: హరీశ్
- స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా చూడండి
- ఆసుపత్రుల్లో మరో వంద ‘మహిళా క్లినిక్స్’ ఏర్పాటు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో ఈ అకడమిక్ ఇయర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈ నెల 15న సెక్రటేరియెట్ లేదా ప్రగతి భవన్ నుంచి కాలేజీలను వర్చువల్గా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఆ రోజు వీడియో కాన్ఫరెన్స్లో స్టూడెంట్లు, ఫ్యాకల్టీ పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
గురువారం ఆఫీసర్లతో మంత్రి రివ్యూ నిర్వహించారు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ మెడికల్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఉండేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వ దవాఖాన్లలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న మహిళల స్పెషల్ క్లినిక్ల సంఖ్యను పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 272 దవాఖాన్లలో ప్రత్యేక క్లినిక్లు నడుస్తుండగా, మరో వంద చోట్ల ఈ క్లినిక్లు నిర్వహించాలని సూచించారు. ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఈ క్లినిక్లలో పూర్తిగా మహిళా డాక్టర్లు, సిబ్బందే ఉంటారు.
ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రూల్స్లో మార్పు
ఎంబీబీఎస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరడానికి గడువును పొడిగించాలని హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డిని హరీశ్రావు ఆదేశించారు. దీంతో గురువారం దాకా ఉన్న గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. సీటు బ్లాకింగ్ దందాను అడ్డుకునేందుకు సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన స్టూడెంట్స్.. థర్డ్ ఫేజ్లో పాల్గొనకుండా రూల్స్ తీసుకొచ్చారు. కానీ దీని వల్ల మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారని కొంత మంది మంత్రిని కలిశారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చిన విద్యార్థులు, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనూ పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని స్టూడెంట్ల తల్లిదండ్రులు కోరగా ఇందుకు హరీశ్ అంగీకరించారు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లోనూ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వీసీని ఆదేశించారు.