న్యూజిలాండ్ టాస్ విన్..ఇండియా బ్యాటింగ్

 న్యూజిలాండ్ టాస్ విన్..ఇండియా బ్యాటింగ్

రెండో టీ20లో హోరాహోరీగా తలపడేందుకు భారత్ న్యూజిలాండ్ సిద్ధమయ్యాయి. మౌంట్ మాంగనీ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దవడంతో ఇవాళ్టి మ్యాచ్ పై ఇరుజట్లు దృష్టి పెట్టాయి.. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉండటంతో ఇరుజట్లు వ్యూహాలకు పదునుపెట్టాయి. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

ఇండియా టీమ్..

హర్ధిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, చాహల్.