రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు

రాష్ట్రంలో మరో 1,486 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,486 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,24,545 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం కరోనా బారినపడి ఏడుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1282కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,891 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,02,577గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,686 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 17,208 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. సోమవారం 42,299 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 38,98,829 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 90.21 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 235, రంగారెడ్డి 112, మేడ్చల్ 102, భద్రాద్రి 98, ఖమ్మం 89, నల్గొండ 82, కరీంనగర్ 69, వరంగల్ అర్బన్ 54 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

దసరాకు 3 వేల స్పెషల్​ బస్సులు.. 50 శాతం చార్జీల పెంపు

ఎన్జీటీ నోటీసులు కొట్టేయమంటూ హైకోర్టుకు మంత్రి కేటీఆర్

కొడుకు పానం బాగయితలేదని తండ్రి ఆత్మహత్య