తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,432 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,432 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,17,670 కేసులు నమోదయ్యాయి. తాజాగా బుధవారం కరోనా బారినపడి 8మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1249కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,949 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,93,218గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,203 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 19,084 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. బుధవారం 38,895 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 37,03,047 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.57 శాతంగా మరియు రికవరీ రేటు 88.76 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 244, మేడ్చల్ 115, రంగారెడ్డి 88, భద్రాద్రి 99, ఖమ్మం 91, కరీంనగర్ 74, నల్గొండ 74, సూర్యపేట 53, వరంగల్ అర్బన్ 46 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

పండక్కి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. మరి నో కాస్ట్ ఈఎంఐ బెటరా? బై నౌ పే లేటర్ బెటరా?

గొంతునొప్పితో బాధపడుతున్నారా.. అయితే ఈ డ్రింక్స్ ఓసారి ట్రై చేయండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మేమే తెచ్చాం