తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,579 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,579 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,26,124 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1287కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,811 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,04,388గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,449 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 17,071 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 41,475 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 39,40,304 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా మరియు రికవరీ రేటు 90.38 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 256, మేడ్చల్ 135, ఖమ్మం 106, రంగారెడ్డి 102, నల్గొండ 90, భద్రాద్రి 87, కరీంనగర్ 64, వరంగల్ అర్బన్ 59, సిద్ధిపేట్ 53, కామారెడ్డి 48, సంగారెడ్డి 47 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

అడవి పందులు వెంటపడ్డయని నీటిలో దూకిన అన్నదమ్ములు.. ఈతరాక మృతి

మక్కలను సర్కారే కొనాలె

రేపట్నుంచి ఏపీకి ఆర్టీసీ బస్సులు?