రాష్టంలో మరో 1,637 కరోనా కేసులు

రాష్టంలో మరో 1,637 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,637 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,44,143 కేసులు నమోదయ్యాయి. తాజాగా మంగళవారం కరోనా బారినపడి ఆరుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,357కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,273 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,24,686గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,100 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 15,335 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. మంగళవారం 45,526 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 44,39,856 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 92.03 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 292, భద్రాద్రి 118, ఖమ్మం 74, మేడ్చల్ 129, రంగారెడ్డి 136, నల్గొండ 101, కరీంనగర్ 90, వరంగల్ అర్బన్ 56, సూర్యపేట్ 45, సిద్ధిపేట్ 41, సంగారెడ్డి 38, కామారెడ్డి 37, జగిత్యాల్ 37, రాజన్న సిరిసిల్ల 36, నాగర్ కర్నూల్ 36, నిజామాబాద్ 36, యాదాద్రి 33, సిద్ధిపేట్ 30 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

యూట్యూబ్‌ లో కొత్త ఫీచర్‌

రైతు వేదికలకు కాదు.. పంట నష్టానికి పైసలియ్యాలె

కొత్త ధరణిలో పాత పేర్లు.. అమ్మిన భూమిని మళ్లీ అమ్మేందుకు యత్నాలు