తెలంగాణలో మరో 2,009 కరోనా కేసులు

తెలంగాణలో మరో 2,009 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,009 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,95,609 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1145కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,437 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,65,844గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 28,320 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 23,372 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 54,098 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 31,04,542 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 84.78 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 293, మేడ్చల్ 173, రంగారెడ్డి 171, కరీంనగర్ 114, నల్గొండ 109, ఖమ్మం 104, భద్రాద్రి 77, సూర్యపేట్ 77, వరంగల్ అర్బన్ 72, కామారెడ్డి 63, నిజామాబాద్ 63, సిద్ధిపేట్ 60, సంగారెడ్డి 55, సిరిసిల్ల 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

కరోనా టైంలో కోటి చీరలు నేసిన నేతన్నలు

లీడర్లూ టెస్టులు చేయించుకోండి క్యాంపుకెళ్లాలె

సర్పంచ్​ను వేదికపైకి పిలిస్తే ఇద్దరొచ్చిన్రు