
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,381 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,81,627 కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1080కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,021 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,50,160గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,387 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. మరో 24,592 కేసులు హోంఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపింది. గురువారం 57,621 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 27,41,836 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా మరియు రికవరీ రేటు 81.67 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 386, రంగారెడ్డి 227, మేడ్చల్ 193, నల్గొండ 132, కరీంనగర్ 119, భద్రాద్రి 97, సిద్ధిపేట్ 86, ఖమ్మం 84, వరంగల్ అర్బన్ 83, సూర్యపేట్ 78, సిరిసిల్ల 70, నిజామాబాద్ 69, మహబూబా బాద్ 68, నాగర్ కర్నూల్ 67, వనపర్తి 58, కామారెడ్డి 58, యాదాద్రి 52, జగిత్యాల 51, సంగారెడ్డి 50 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..