కోల్కతా: టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్కు ఐపీఎల్లో ప్రమోషన్ దక్కింది. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) వైస్ కెప్టెన్గా రింకు సింగ్ ఎంపికయ్యాడు. తద్వారా ఐపీఎల్ 19వ సీజన్లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానేకు రింకు డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని కేకేఆర్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకీ మైసూర్ మంగళవారం (మార్చి 24) అఫిషియల్గా ప్రకటించారు. ‘‘రింకు సింగ్ కేకేఆర్ వైస్ కెప్టెన్గా ఉంటారని ప్రకటించడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. రింకు 2018లో కేకేఆర్లో చేరాడు. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్గా ఆడుతున్నాడు’’ అని పేర్కొన్నాడు.
రింకు ఐపీఎల్ కెరీర్:
బెస్ట్ ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ 2018లో ఐపీఎల్లో అరంగ్రేటం చేశాడు. అప్పటి నుంచి కేకేఆర్ తరుఫునే ఆడుతున్నాడు. రింకు ఇప్పటి వరకు 59 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 30.52 సగటు, 145.17 స్ట్రైక్ రేట్తో 1099 రన్స్ చేశాడు. 2023లో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో రింకు సింగ్ది కీలక పాత్ర. ఆ సీజన్లో14 ఇన్నింగ్స్లలో 474 పరుగులు చేసి కేకేఆర్ కు మూడోసారి ట్రోఫీ అందించాడు.
►ALSO READ | IPL Captains Meeting: రేపే ఐపీఎల్ కెప్టెన్లతో బీసీసీఐ కీలక సమావేశం.. చర్చకు వచ్చే అంశాలివే..!
ఆర్సీబీతో జరిగిన ఓ మ్యాచులో యశ్ దయాల్ బౌలింగ్లో ఒకే ఓవర్లో వరుసగా 5 సిక్సులు కొట్టడం రింకు బెస్ట్ ఇన్నింగ్స్లలో ఒకటి. మరీ ఈ సీజన్లో వైస్ కెప్టెన్గా కొత్త బాధ్యతలు చేపట్టనున్న రింకు సింగ్ ఏ మేర రాణిస్తాడో చూడాలి. కేకేఆర్ ఐపీఎల్ 19వ సీజన్ను మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్తో ప్రారంభించనుంది.
