- పెళ్లైన కొద్ది గంటల్లోనే క్వారంటైన్లోకి
భోపాల్: పెండ్లి కొచ్చిన చుట్టాల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో కొత్త జంటతో సహా 100 మంది అధికారులు క్వారంటైన్లోకి పంపించారు. మధ్యప్రదేశ్లోని ఛింద్వారా జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో ఉద్యోగం చేస్తున్న వధువు బంధువు పోయిన వారం ఛింద్వారా జిల్లాలోని జున్నార్దియోలో ఉన్న ఇంటికి వెళ్లారు. జిల్లా సరిహద్దుల్లో అతనికి స్ర్కీనింగ్ చేసిన అధికారులు వెళ్లేందుకు అనుమతించారు. కాగా ఆ వ్యక్తి ఈ నెల 26న తన మరదలి పెళ్లికి హాజరయ్యాడు. అతనికి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేసిన అధికారులు వైరస్ సోకినట్లు మంగళవారం నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అతడిని కలిసిన ప్రమైరీ కాంటాక్ట్స్ను గుర్తిస్తున్నామని, వధూవరులతో సహా పెళ్లికి వచ్చిన 100 మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని కలెక్టర్ సౌరభ్ సుమన్ చెప్పారు. అతనిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు.