కార్తికేయ 2.. ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్

కార్తికేయ 2.. ఓటీటీ స్ట్రీమింగ్ పై ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్

హీరో నిఖిల్, అనుపమ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2 ఆగస్టు 13న రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. చందూ మోండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మూవీ టీం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 5 ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ కానుందని ఇప్పటికే పలు ప్రచారం జరగగా.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను  ప్రముఖ ఓటీటీ సంస్థ  జీ5 భారీ మెుత్తానికి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 5న స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను కూడా తమ ట్విట్టర్ అకౌంట్లో రిలీజ్ చేసింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ మంచి రెస్పాన్స్ ను కూడగట్టుకుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ ఒక్క సినిమాతోనే నిఖిల్ ఇంతకు మునుపు లేని క్రేజ్ ను దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నిఖిల్ 18 పేజీస్, స్పై అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.