నిలోఫర్ డాక్టర్లను క్వారైంటైన్ కు తరలింపు

నిలోఫర్ డాక్టర్లను క్వారైంటైన్ కు తరలింపు

హైదరాబాద్ లోని నిలోఫర్‌ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఉన్నతాధికారులు అలర్టయ్యారు. చిన్నారికి  ట్రీట్ మెంట్  చేసిన డాక్టర్లు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. ఈనెల 15వ తేదీ రాత్రి విధుల్లో పాల్గొన్న వారితో పాటు 16, 17 తేదీల్లో మూడు షిఫ్టుల్లో పనిచేసిన కొందరిని క్వారంటైన్‌కు వెళ్లాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ మూడు రోజులు కలిపి దాదాపు 10 మంది వైద్య సిబ్బంది విధుల్లో ఉన్నట్లు గుర్తించారు వైద్యాధికారులు.