నిర్భయ కేసు రోజురోజుకో మలుపు తిరుగుతుంది. నలుగురు దోషుల క్షమాభిక్ష పిటీషన్ను రాష్ట్రపతి మూడు రోజుల కిందే తిరస్కరించారు. దాంతో ఆ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయడం దాదాపు ఖాయమనే అనుకున్నారు. అయితే.. రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుతూ వినయ్ శర్మ పిటీషన్ను దాఖలు చేశాడు. ఆ పిటీషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. వినయ్ శర్మ పిటీషన్ పెండింగ్లో ఉన్నందున అతని ఉరి శిక్ష వాయిదా పడుతుందని తీహార్ జైలు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇర్ఫాన్ అహ్మద్ అన్నారు. ఇందులో వేరే ఉద్దేశమేది లేదని ఆయన అన్నారు. కాగా.. మిగతా దోషులను ముందు అనుకున్నట్లుగానే జైలు అధికారులు ఉరి తీస్తారని ఆయన అన్నారు.
For More News..
