
- త్వరలోనే రేవంత్ సర్కారు కూల్తది
- ఇవి నరేంద్ర మోదీ ఎన్నికలు
- రాముడి పేరు కడుపు నిండుతది
- నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్
హైదరాబాద్: దేశభద్రతపై కాంగ్రెస్ స్టాండ్ ఏమిటని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ప్రశ్నించారు. ఇవాళ నిజామాబాద్ లో నిర్వ హించిన ప్రెస్ మీట్ లో అర్వింద్ మాట్లాడుతూ రద్దయిన ఉగ్రవాద సంస్థలు, ఆర్గనైజేషన్లు బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఏమిటన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టెర్రరిస్టులు రాజ్యమేలుతారని హెచ్చరించారు.
ఫ్రీ హామీలిచ్చి ప్రజలను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు. వారి ఉసురు తగిలి త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతదన్నారు. మన సంస్కృతి, సాంప్రదా యాలను కాపాడుకునే ఎన్నికలింన్నారు. కానీ ఈ సారి జరిగే ఎన్నికలు నరేంద్ర మోదీ ఎన్నికలని చెప్పారు. రాముడి పేరు చెబితే కడుపు నిండుతదా అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఖచ్చితంగా తమకుకడుపు నిండుతదన్నారు.
మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తుందన్నారు. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ కొత్తేమీ కాదని, కాంగ్రెస్ పార్టీ అమెండ్మెంట్స్ ఎక్కువ సార్లు చేసిందన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పదం ఎట్లా చేరుస్తదన్నారు. రేవంత్ హిందువులకు సూక్తులు చెప్పడం బంద్ చేయాలన్నారు. మహిళలు ఎన్నికల్లో ముఖం కనిపించకుండా ఓటు వేయడాన్ని అనుమతించవద్దనే విషయమై ఈసీకి లేఖ రాసినట్లు తెలిపారు.