ప్రభుత్వ వైఫల్యాల వల్లే రైతులకు నష్టాలు: ఎంపీ అర్వింద్

ప్రభుత్వ వైఫల్యాల వల్లే రైతులకు నష్టాలు: ఎంపీ అర్వింద్

ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లాలో గతం కన్నా రెట్టింపు ధాన్యం దిగుబడి వచ్చిందని, అయితే మార్కెట్ యార్డ్ లు సరిగా లేవని, ధాన్యాన్ని ఆరబెట్టాడానికి ఫ్లాట్ ఫాంలు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. రెండోరోజు గాంధీ సంకల్ప యాత్రలో అరవింద్ పాల్గొన్నారు. గాందీ చౌక్ నుంచి వినాయక్ నగర్ పాదయాత్ర చేశారు. అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు.  ధాన్యం కొనుగోలు మీద వెంటనే  ప్రభుత్వం సమీక్ష చేయలని కోరారు.