సమస్యల తోరణం పేరుతో మున్సిపల్ ఆఫీసు గేటుకు వినతి పత్రం

సమస్యల తోరణం పేరుతో మున్సిపల్ ఆఫీసు గేటుకు వినతి పత్రం

నిజాంపేట్ మునిసిపల్ పరిధిలో అభివృద్ధి జరిగిందంటూ ఎమ్మెల్యే, అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని మాజీ ఎమ్మెల్యే,  బీజేపీ సీనియర్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట వివిధ కాలనీ వాసులతో కలిసి బీజేపీ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. సమస్యల తోరణం పేరుతో మున్సిపల్ కార్యాలయ గేటుకు వినతి పత్రాన్ని కట్టి నిరసన వ్యక్తం చేశారు. పార్కుల స్థలాలు, కాలనీ రోడ్లు కబ్జా అవుతున్నాయని ఎన్నిసార్లు కమిషనర్ కు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు.

సమస్యలు పరిష్కరించాలని ప్రజలు విన్నవించుకున్నా స్పందించడం లేదని, అధికారులు ఇలానే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో వారికి బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ ఉంటుందని కూన శ్రీశైలం గౌడ్ హెచ్చరించారు, ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడాలని లేనిపక్షంలో వందల మందితో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.