వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం

వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుల్లపల్లి మంజులపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. కలెక్టర్ నిఖిలా రెడ్డికి 24మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన తీర్మానాన్ని అందజేశారు. రెండున్నరేళ్ల ఒప్పందం మేరకు చైర్పర్సన్ పీఠం అధిష్ఠించిన మంజుల.. ఆ తర్వాత రాజీనామా చేయకపోవడంతో అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు కౌన్సిలర్ లంకా పుష్పలతారెడ్డి చెప్పారు. మొత్తం 32 మంది సభ్యుల్లో తనకు 23మంది మద్ధతు ఉన్నట్లు పుష్పలతారెడ్డి స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానంతో మున్సిపల్ చైర్పర్సన్ చిగుల్లపల్లి మంజుల బీఆర్ఎస్ కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.