- సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా
- ఢిల్లీ కోర్టుకు ఎయిమ్స్ రిపోర్టు
- మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత
న్యూ ఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. చిదంబరం హెల్త్ కండిషన్ ను పరిశీలించాలన్న కోర్టు ఆదేశాలపై ఏర్పాటైన ఎయిమ్స్ మెడికల్ బోర్డు ఇచ్చిన రిపోర్టును.. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చదివి వినిపించారు. ఆ రిపోర్టు ప్రకారం చిదంబరం ఆరోగ్యంగానే ఉన్నారని, హాస్పిటల్ కు తీసుకెళ్లాల్సిన, బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఈ వాదనలు విన్న హైకోర్టు జడ్జి జస్టిస్ సురేశ్ కైత్.. చిదంబరానికి ఇంట్లో వండిన ఫుడ్, మినరల్ వాటర్, దోమ తెరలు అందించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా మెడికల్ చెకప్ లు చేయించాలని జైలు సూపరింటెండెంట్కు ఉత్తర్వులిచ్చారు. చిదంబరం అడ్వకేట్ కపిల్ సిబల్ దీనికి అంగీకరించడంతో జడ్జి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు.