- చెన్నైలో నో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్
- అంతర్ రాష్ట్ర సర్వీసులకు నో పర్మిషన్
- మెట్రో, ఆలయాలు తెరవడంపై ఆంక్షలు
చెన్నై: లాక్డౌన్ 5కి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్డౌన్ను కొనసాగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. జూన్ 8 తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్ ఇచ్చారు. కంటామినేటెడ్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. చెన్నై, తిరువెళ్లూరు, చెంగళ్పట్టు, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కు అనుమతి లేదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50 శాతం బస్సులు తిరుగుతాయని చెప్పారు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, కేంద్ర హోంశాఖ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం జూన్ 30 వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. దేవాలయాలు, మెట్రో, ఇంటర్ స్టేట్ బస్ ట్రాన్స్పోర్ట్, సబ్ అర్బన్ ట్రైన్స్పై బ్యాన్ కొనసాగుతుందని అన్నారు. కంటామినేటెడ్ జోన్లలో తప్పి మిగతా ప్రదేశాల్లో అన్ని షోరూమ్లు, షాపులు, రెస్టారెంట్లలో కేవలం 50 శాతం మంది వర్కర్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ట్యాక్సీలు, ఆటోలు పాసులు లేకుండా తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. చెన్నైలో కేసులు ఎక్కువగా ఉన్నందున ఐటీ కంపెనీల్లో కేవలం 20 శాతం మందికి మాత్రమే అనుమతించారు. కాగా.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో 100 శాతం ఎంప్లాయిస్ అనుమతించనున్నారు.