రామ్ చరణ్ సినిమాకి వచ్చిన ఇబ్బందేమీ లేదు

రామ్ చరణ్ సినిమాకి వచ్చిన ఇబ్బందేమీ లేదు

ఆర్ఆర్ఆర్, ఆచార్య చిత్రాల తర్వాత శంకర్ డైరెక్షన్‌‌లో సినిమాకి కమిటయ్యాడు రామ్ చరణ్. ఈ కాంబోని అనౌన్స్ చేయడంతోనే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఆర్‌‌‌‌సీ 15’ వర్కింగ్ టైటిల్‌‌తో దిల్ రాజు నిర్మిస్తున్న యాభయ్యో సినిమా ఇది. చాలావరకు షూటింగ్ పూర్తయింది. అయితే రీసెంట్‌‌గా శంకర్ ‘ఇండియన్2’ స్టార్ట్ చేయడంతో మెగా ఫ్యాన్స్‌‌ కాస్త కంగారుపడ్డారు. ఎందుకంటే శంకర్‌‌‌‌ ఒక సినిమా పూర్తయ్యాకే ఇంకో సినిమా చేస్తారు. అందుకే కమల్‌‌తో వర్క్ మొదలుపెట్టారు కాబట్టి ఇక చరణ్ మూవీకి బ్రేక్ పడినట్టేనని, ‘ఇండియన్ 2’ని పూర్తి చేయడం కోసం శంకర్ ఈ సినిమాని ఆపేశారని, అది పూర్తయ్యాకే మళ్లీ దీని వర్క్ చేస్తారని ప్రచారం మొదలయ్యింది.

అది గమనించిన శంకర్ వెంటనే రియాక్టయ్యారు. ఈ వార్తల్లో నిజం లేదని, రామ్ చరణ్ సినిమాకి వచ్చిన ఇబ్బందేమీ లేదని, రెండు సినిమాల్నీ తాను ఒకేసారి తీయబోతున్నానని చెప్పారాయన. చరణ్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌‌లో స్టార్ట్ చేయబోతున్నామని.. హైదరాబాద్‌‌లోను, వైజాగ్‌‌లోను ఇంపార్టెంట్ సీన్స్ తీయబోతు న్నామని కన్‌‌ఫర్మ్ చేశారు. దాంతో అన్ని ప్రచారాలకీ ఫుల్‌‌స్టాప్ పడిపోయింది. కియారా అద్వానీ హీరోయిన్‌‌గా నటిస్తోంది జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.