నేను NCP లోనే ఉన్నా: అజిత్, అందులో నిజం లేదు: శరద్

నేను NCP లోనే ఉన్నా: అజిత్, అందులో నిజం లేదు: శరద్

మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతూనే ఉంది. శరద్ పవార్ కు హ్యాండిచ్చి బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్ ఆసక్తికర ట్వీట్లు చేశారు. తాను ఇంకా ఎన్సీపీలో ఉన్నానని ట్వీట్ చేశారు. శరద్ పవారే తన నాయకుడని, బీజేపీ, ఎన్సీపీ కలిసి మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదన్న అజిత్ పవార్.. కాస్త ఓపిక పడితే అన్నీ సర్దుకుంటాయని ట్వీట్ లో రాశారు.

ఈ ట్వీట్ కు శరద్ పవార్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీతో ఎన్సీపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శివసేన, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ ఇప్పటికే నిర్ణయించిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు అసత్యమన్న శరద్ పవార్…ప్రజలను గందరగోళ పరిచేందుకే ఈ ప్రచారం చేస్తున్నారన్నారు.