రాజీవ్ స్వగృహ ఫ్లాట్లలో టోకెన్ అమౌంట్​కు 7వరకు గడువు పెంపు

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లలో టోకెన్ అమౌంట్​కు 7వరకు గడువు పెంపు

2200 ఫ్లాట్లకు 1600 డీడీలే

హైదరాబాద్, వెలుగు: బండ్లగూడ, పోచారం లో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు రెస్పాన్స్ తక్కువగా వస్తోంది. ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం టోకెన్ అమౌంట్ కట్టేందుకు గత నెల 26  లాస్ట్ డేట్ ఉండగా బుధవారం వరకు పెంచారు. అయినా పూర్తి స్థాయిలో డీడీలు రాకపోవడంతో ఈనెల 7 వరకు రెండో సారి గడువు పెంచుతూ హెచ్ ఎం డీ ఏ ప్రకటించింది. ఈ రెండు ప్రాంతాల్లో త్రిబుల్ బెడ్ రూమ్, డీలక్స్, డబుల్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 2200 ఉండగా బుధవారం వరకు 1600 మంది మాత్రమే డీడీలు కట్టారని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. 

రూ.40లక్షల లోపు ధరకే త్రిబుల్ బెడ్ రూమ్ అందుబాటులో ఉండటంతో ఎక్కవు మంది వీటికే డీడీలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్లకు గతంలో అప్లికేషన్ పెట్టుకున్న వారు త్రిబుల్ బెడ్ రూమ్ కు రూ.3లక్షలు, డబుల్ బెడ్ రూమ్ కు రూ.2లక్షలు, సింగిల్ బెడ్ రూమ్ కు రూ.లక్ష టోకెన్ అమౌంట్ ను కమిషనర్, హెచ్​ఎండీఏ పేరుతో డీడీ తీసి, హిమాయత్ నగర్ లోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆఫీసులో అందజేయాలని హెచ్ ఎం డీఏ తెలిపింది.