
నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్పురస్కారాలకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పబ్లిక్ అఫైర్స్, సివిల్ సర్వీస్, వాణిజ్యం, పరిశ్రమల రంగాల్లో విశిష్ట సేవలందించి, విజయాలు సాధించిన వారికి ఈ అవార్డులు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
2026 సంవత్సరానికి సంబంధించిన నామినేషన్లను గరిష్టంగా 800 పదాలకు మించకుండా జులై 31 లోగా https://awards.gov.in కు పంపాలని సూచించారు. అవార్డుకు ప్రతిపాదిస్తున్న వ్యక్తి సేవ/కృషిని స్పష్టంగా తెలియజేయాలన్నారు.