పదేళ్ల దిగువకు బ్యాంకుల మొండి బాకీలు... మన బ్యాంకులు స్ట్రాంగ్​గానే ఉన్నయని ఆర్​బీఐ రిపోర్టు

పదేళ్ల దిగువకు  బ్యాంకుల మొండి బాకీలు... మన బ్యాంకులు స్ట్రాంగ్​గానే ఉన్నయని ఆర్​బీఐ రిపోర్టు

ముంబై: దేశంలోని షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంకుల మొండి బాకీలు (ఎన్​పీఏ) పదేళ్ల దిగువ లెవెల్​3.9 శాతానికి తగ్గాయి. మార్చి 2023 చివరి నాటికి ఈ లెవెల్​కు చేరినట్లు రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా బుధవారం ప్రకటించిన ఫైనాన్షియల్​ స్టెబిలిటీ రిపోర్టు వెల్లడించింది. ఆయా బ్యాంకులపై మాక్రో స్ట్రెస్​ టెస్టులను నిర్వహించినట్లు పేర్కొంది. తగినంత క్యాపిటల్​ ఉండటంతో వత్తిడి ఎదురైనా ఆ షెడ్యూల్డ్​ కమర్షియల్​ బ్యాంకులు తట్టుకోగలవని ఈ రిపోర్టు తెలిపింది. మార్చి 2018 నాటికి 11.5 శాతంగా ఉన్న గ్రాస్​ ఎన్​పీఏ రేషియో మార్చి 2023 నాటికి 3.9 శాతానికి తగ్గిపోయింది. ఇదే కాలానికి నెట్​ ఎన్​పీఏ రేషియో కూడా 6.1 శాతం నుంచి 1.0 శాతానికి దిగిపోయింది. 

కానీ, కొన్ని నాన్​–బ్యాంకింగ్​ ఫైనాన్షియల్​ ఇంటర్మీడియరీలకు ఎక్కువ లెవరేజ్​ కనబడుతోందని, వాటి వల్ల సిస్టమ్​కు రిస్క్​ ఉందని ఆర్​బీఐ తన ఫైనాన్షియల్​ స్టెబిలిటీ రిపోర్టులో పేర్కొంది. మార్చి 2023 నుంచి గ్లోబల్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయని ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​ చెప్పారు. అయితే, మన దేశంలోని ఫైనాన్షియల్​ సెక్టార్​ మాత్రం ఈ టైములో పటిష్టంగా ఉందని పేర్కొన్నారు. 

బ్యాంకులు ఇచ్చే అప్పులు కూడా నిలకడగా పెరుగుతున్నాయని, వాటి ఎన్​పీఏలు తగ్గుతున్నాయని, క్యాపిటల్​ నిల్వలు తగినంతగా ఉన్నాయని  వివరించారు. మే 2023 లో నిర్వహించిన సిస్టమిక్​ రిస్క్​ సర్వేలో దేశంలోని చాలా కేటగిరీలలో రిస్క్​ తక్కువగానే ఉన్నట్లు తేలిందన్నారు. కాకపోతే, గ్లోబల్​ పరిణామాల నేపథ్యంలో కొంత ఎఫెక్ట్​ పడే ఛాన్సులున్నాయని దాస్​ చెప్పారు. గ్లోబల్​ ఫైనాన్షియల్​ సిస్టమ్​పై నమ్మకం తగ్గుతున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది అభిప్రాయపడినట్లు ఆర్​బీఐ తాజా రిపోర్టు తెలిపింది. దేశంలోని ఫైనాన్షియల్​ సెక్టార్​ రెగ్యులేటర్లు అందరి దగ్గరి నుంచీ తీసుకున్న సమాచారంతో ఏడాదికి రెండు సార్లు ఈ ఫైనాన్షియల్​ స్టెబిలిటీ రిపోర్టును ఆర్​బీఐ ప్రకటిస్తోంది.