చైనాకు ఒక్క ఇంచు భూమినీ పోనివ్వం

చైనాకు ఒక్క ఇంచు భూమినీ పోనివ్వం

న్యూఢిల్లీ: దేశ సరిహద్దుల నుంచి ఒక్క అంగుళం భూమిని కూడా చైనాకు పోనివ్వబోమని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. డ్రాగన్ దుశ్చర్యను మన సైనికులు దీటుగా తిప్పికొట్టారని ఆయన స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడే క్రమంలో ప్రాణ త్యాగాలు చేసిన జవాన్లకు రాజ్‌నాథ్ శ్రద్ధాంజలి ఘటించారు. దేశ సార్వభౌమత్వాన్ని రక్షించేందుకు ఏ సవాల్‌‌ను ఎదుర్కోవడానికైనా జవాన్లు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. మనం ఏ పార్టీకి చెందిన వారమైనా దేశ రక్షణ విషయంలో మాత్రం అందరం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి శాంతియుత పరిస్థితులను నెలకొల్పడానికి తామెప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ కోసం యత్నిస్తున్నామని తెలిపారు.