హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం (టీఎస్పీఎస్సీ) ముట్టడికి ఎన్ఎస్యూఐ విద్యార్థులు ప్రయత్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ TSPSC ఆఫీసు ముట్టడి ఆందోళన నిర్వహించాలని ప్లాన్ చేశారు. ముందుగా గాంధీభవన్ కు చేరుకుని అక్కడ నుండి రెండు గేట్ల నుంచి టీఎస్పీఎస్సీ ఆఫీసు ముట్టడికి వెళ్తున్న స్డూడెండ్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీ భవన్ చుట్టూ వందలాదీగా పోలీసులు మోహరించారు. దీంతో ఉద్రికత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేదాకా ఉద్యమం ఆగదని ఎన్.ఎస్.యూ.ఐ విద్యార్ధులు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
సీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం