పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి

పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించాలి

పద్మారావునగర్​, వెలుగు :  మూడు నెలలుగా పెండింగ్‌‌‌‌లో ఉన్న  జీతాలను వెంటనే చెల్లించాలని.. తమను రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రి  ఔట్​ సోర్సింగ్, కాంట్రాక్ట్  నర్సులు ఆదివారం ఆందోళన నిర్వహించారు.  డ్యూటీలను బహిష్కరించిన నర్సులు గాంధీ మెయిన్​ బిల్డింగ్​ ఎదుట  బైఠాయించి ధర్నా చేశారు.  పలువురు నర్సులు మాట్లాడుతూ

3 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్​ ఫీజులు చెల్లించలేక, కుటుంబపోషణకు  నానా అగచాట్లు పడుతున్నామని వాపోయారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా గతంలో ఉన్న రూ.32 వేల జీతాన్ని  పెంచాల్సిందిపోయి, రూ .25 వేలకు తగ్గించడం ఏమిటని వారు ప్రశ్నించారు.  వెంటనే జీతాలను పెంచాలని, పెండింగ్ జీతాలను ఇవ్వాలని నర్సులు డిమాండ్ చేశారు.