పెన్షన్ డబ్బులు కనిపించట్లేదని వృద్ధుడి ఆత్మహత్య

పెన్షన్ డబ్బులు కనిపించట్లేదని వృద్ధుడి ఆత్మహత్య

చిగురుమామిడి, వెలుగు: పెన్షన్ డబ్బులు కనిపించట్లేదని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండా పూర్ గ్రామానికి చెందిన మహంకాళి రాజయ్య(70) సూసైడ్ చేసుకున్నాడు. తన ఇంట్లో దాచుకున్న రూ.1500 పెన్షన్ డబ్బు లు కనిపించడం లేదని మనస్తాపం చెంది తన ఇంటివెనక ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడని రాజయ్య కూతురు శనిగరం బాబ్లీ ఆదివారం వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.