
వృద్ధాప్యంలో యోగక్షేమాలు చూడని ఓ కొడుకు భూమి కోసం తల్లి చనిపోయిందని తప్పుడు పత్రాలు సృష్టించాడు. బతికుండగానే తన తల్లి చనిపోయిందని డెత్ సర్టిఫికెట్ పొంది, ల్యాండ్ ను తన పేరుమీద చేసుకోబోయాడు ఆ పుత్రరత్నం. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగింది. రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడైన ఓ ప్రజా అధికారి.. తన తల్లి చనిపోయిందని తప్పుడు పత్రాలు సృష్టించాడు. ఎలగైనా భూమిని పట్టా చేయాలని VROపై ఒత్తిడి చేశాడు.
అసలు విషయం భూమి యజమాని అయిన వృద్ధురాలికి తెలియడంతో.. నేను బతికే ఉన్నానని రిజిస్ట్రేషన్ ను ఆపాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది తల్లి. ‘నేను బతికే ఉన్నాను చనిపోలేదు’ అని రాసిన ఉన్న ఓ ఫ్లకార్డు పట్టుకుని నిరసన వ్యక్తం చేసింది ఆ ముసలవ్వ.