ఉద్యోగం రాలేదని మరో నిరుద్యోగి సూసైడ్

ఉద్యోగం రాలేదని మరో నిరుద్యోగి సూసైడ్

ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సునీల్ నాయక్ మృతిని మరవకముందే మరో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక శ్రీకాంత్ (25) అనే యువకుడు ఉద్యోగం రాలేదని మనస్థాపంతో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో Msc.Botony చేసిన శ్రీకాంత్.. కొంతకాలం నుంచి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అయితే చాలా కాలం నుంచి ఎటువంటి నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో శ్రీకాంత్ మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

కాగా.. రాష్ట్రంలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు చనిపోతుండటం అందరినీ కలచివేస్తుంది. సునీల్ నాయక్ సూసైడ్‌తోనైనా నోటిఫికేషన్లు వస్తాయని యువత ఎంతగానో ఎదురుచూశారు. కానీ ఎటువంటి నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరుద్యోగులు మళ్లీ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.