సికింద్రాబాద్, వెలుగు: బైక్ యాక్సిడెంట్ విషయంలో యువకుల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణం తీసింది. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్.ఎన్ నగర్లో రెండ్రోజుల కిందట నాసర్ వెహికల్ను ఫైజల్(20) ఢీ కొట్టాడు. నాసర్ వెహికల్ ఖరాబ్ కావడంతో బుధవారం అతడు తన ఫ్రెండ్స్ను తీసుకుని వచ్చి .. వెహికల్ విషయంలో మాట్లాడుదామని ఫైజల్ ను పిలిచాడు. నాసర్,ఫైజల్ మధ్య మాటామాటా పెరిగింది. నాసర్, అతడి ఫ్రెండ్స్ పిడిగుద్దులతో ఫైజల్ పై దాడి చేశారు. ఫైజల్ స్పృహ కోల్పోయి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితులు నాసర్ , అతడి ఫ్రెండ్స్ హారబాస్, ఆరిఫ్, సోను, రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఫైజల్ డెడ్బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్కి తరలించారు.
see more news