హైదరాబాద్ లో పేద జంటలకు రూపాయికే వైభవంగా వివాహం జరిపిస్తామన్నారు రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్, అరుణ దంపతులు. 15 ఏళ్ల నుంచి సామాజిక సేవలో భాగంగా 108 పేద, వికలాంగుల జంటలకు వివాహాలు జరిపించామన్నారు. ఒక్క రూపాయితో ఫౌండేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే నూతన జంటను పుస్తె, మెట్టెలు ఇచ్చి మూడుముళ్ల బంధంతో ఏకం చేస్తామన్నారు.
సంగారెడ్డికి చెందిన ప్రవళిక, మేడ్చల్ రమేష్ కు ఇవాళ సైదాబాద్ లో వివాహం జరిపించారు. పెళ్లికి హాజరయ్యే బంధువులకు బోజనాలు ఏర్పాటు చేస్తామన్నారు రూపాయి ఫౌండేషన్ ఛైర్మన్ అనిల్ కుమార్. ఇలాంటి వివాహాలకు చేయూతనిచ్చేందుకు తమవంతుగా రూపాయి విరాళం ఇవ్వాలని కోరారు.