మండుతున్న ఉల్లి ధరలు.. మార్కెట్లో కిలో ఎంతంటే.?

మండుతున్న ఉల్లి ధరలు.. మార్కెట్లో కిలో ఎంతంటే.?

గత వారం నుంచి  దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు పెరిగిపోతున్నాయి. ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కిలో వంద రూపాయలకు చేరింది. ఢిల్లీలో 65 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఆలస్యం కావడంతో ఉల్లి ధరలు  సామాన్యుడికి మరోసారి కన్నీళ్లు పెట్టిస్తోంది.

పండుగ సీజన్ లో ఉల్లికి డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల పాలు ఉల్లి ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.పెరుగుతున్న ఉలి ధరలల ఉల్లి పాయలను వినియోగించే లక్షలాది కుటుంబాలపై అదనపు భారం పడవచ్చు. 

డిమాండ్ పెరగడం, ఉత్పత్తి ఆలస్యం కావడంతో ఉల్లి ఎగుమతులపై ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ధరల పెరుగుదలను అరికట్టేందుకు , వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు రిటైల్ విక్రయాలు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ధరలు బాగా పెరిగిన రాష్ట్రాల్లో హోల్ సేల్, రిటైల్ మార్కెట్లలో బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని సరఫరా చేస్తున్నారు.

కనీస ఎగుమతి ధర టన్నుకు 67 వేల రూపాయలుగా నిర్ణయించింది. ఇది ఆదివారం నుంచి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందని ప్రకటించింది. బెంగళూరు రోజ్, కృష్ణాపురం ఉల్లి  మినహా అన్ని రకాల ఉల్లి పంటలపై MEP వర్తిస్తుందని తెలిపింది.  ఇప్పటికే 5 లక్షల టన్నుల ఉల్లిని సేకరించామన్నారు అధికారులు. మరో 2 లక్షల టన్నుల సేకరణకు రెడీ అవుతున్నామని చెప్పారు. మరోవైపు ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో సహకార సంఘాల ద్వారా 25 రూపాయలకు కిలో అమ్మడానికి ఏర్పాట్లు చేశారు.