శివరాంపల్లిలో క్రికెట్ బెట్టింగ్

శివరాంపల్లిలో క్రికెట్ బెట్టింగ్

శంషాబాద్,  వెలుగు: క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న వ్యక్తిని శంషాబాద్ జోన్ ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. చుడీబజార్ కి చెందిన విజయ్ కుమార్ రాజేంద్రనగర్ సర్కిల్ పరిధి శివరాంపల్లిలో ఓ ఇల్లు రెంట్ కి తీసుకుని సిటీకి చెందిన కపిల్, అనిల్, ఎల్ బీనగర్ కి చెందిన శశితో కలిసి ఆన్ లైన్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఇండియా– వెస్టిండిస్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ పై ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా.. శంషాబాద్ ఎస్ వోటీ జోన్ పోలీసులు దాడులు చేశారు. విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. రూ. 10 లక్షల 9 వేల క్యాష్, 14 సెల్ ఫోన్లు, బైక్, 1 ఎల్ఈడీ టీవీని స్వాధీనం చేసుకున్నారు. లైవ్ లైన్ గురు, క్రికెట్ బజ్, క్రికెట్ మజా ఆన్ లైన్ యాప్ నుంచి బెట్టింగ్ చేస్తున్నట్లు విజయ్ కుమార్ పోలీసుల విచారణలో తెలిపాడు. అతడిపై గేమింగ్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసినట్లు శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. పరారీలో ఉన్న కపిల్, అనిల్, శశి కోసం గాలిస్తున్నామన్నారు.