
బషీర్బాగ్, వెలుగు: హోల్సేల్ధరలకే ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అంటూ సిటీకి చెందిన ఓ వ్యాపారిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. గత నెల 9న కోల్ కతా నుంచి అంటూ వ్యాపారికి స్కామర్లు ఫోన్చేశారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ కు రిటర్న్ వచ్చే ప్రొడక్ట్స్ ను విక్రయిస్తామని తెలిపారు. ఫ్యాన్లు, బ్యాగులు, క్రాకర్స్, వాచ్ లు, షూ, స్కూల్ బాగ్స్హోల్ సేల్ ధరలకు అమ్ముతామని నమ్మబలికారు. బ్యాగ్స్, ఫ్యాన్ల ఫొటోలు పంపడంతో నిజమేనని నమ్మిన వ్యాపారి 750 స్కూల్ బాగ్స్, 25 మిస్ట్ ఫాన్స్, 60 నార్మల్ ఫ్యాన్స్ ఆర్డర్ ఇచ్చాడు.
ఐదు రోజుల్లో కోల్ కతా నుంచి మా వైష్ణో ట్రాన్స్పోర్టు ద్వారా మెటీరియల్ డెలివరీ చేస్తామని స్కామర్లు చెప్పడంతో వ్యాపారి రూ.18 వేలు అడ్వాన్స్ పంపించాడు. ఐదు రోజులు దాటినా సరుకు రాకపోవడంతో వ్యాపారి స్కామర్లకు కాల్చేశాడు. వరంగల్ లో సరుకు ఆగిందని, త్వరలో డెలివరీ చేస్తామని చెప్పడంతో మిగిలిన మొత్తం అమౌంట్కూడా పంపించాడు.
మనీ అందాక స్కామర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మోసపపోయానని తెలుసుకున్న బాధితుడు ఆన్లైన్ద్వారా సైబర్క్రైఐమ్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ.2,69,530 పోగొట్టుకున్నట్లు పేర్కొన్నాడు. కేసు ఫైల్చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.