
- నకిలీ ప్లాట్ఫామ్ల ఉచ్చులో బాధితులు
- రెచ్చిపోతున్న సైబర్ క్రిమినల్స్
- సోషల్ మీడియా ద్వారా ట్రాప్
- తొందరగా గుర్తిస్తేనే రికవరీ సాధ్యం
హైదరాబాద్సిటీ, వెలుగు : టెక్ సిటీగా రోజు రోజుకూ డెవలప్అవుతున్న నగరంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు రోజు ఏకంగా పదుల సంఖ్యలో బాధితులను సైబర్క్రిమినల్స్చీట్చేస్తున్నారు. కిందటేడాది హైదరాబాద్ నగరవాసులు సైబర్ నేరాల ద్వారా రూ.1,866 కోట్లు కోల్పోయారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అయితే, ఇందులో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల పేరుతో జరుగుతున్న మోసాలే ఎక్కువగా ఉండగా, ఈసారి కూడా అలాంటి మోసాలే అధికంగా నమోదవుతున్నాయి. వీటివల్ల సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరూ ఆందోళన చెందుతున్నారు.
మోసాల మాయాజాలం
సైబర్ నేరగాళ్లు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ల ద్వారా ప్రచారం చేసి దోచుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లను వేదికలుగా చేసుకుంటున్నారు. దాదాపు అందరూ సోషల్మీడియాల్లోనే ఉంటుండడంతో అదే కరెక్ట్వేగా సెలెక్ట్చేసుకున్నారు. తమ స్కీమ్లలో తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఇస్తామని ఆశ చూపుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్కు చెందిన ఓ మహిళ గోల్డ్ మర్చంట్ ప్లాట్ఫామ్ అనే నకిలీ వెబ్సైట్ ద్వారా రూ.1.60 లక్షలు పోగొట్టుకుంది.
ఆమెను ఇన్స్టా ద్వారా నమ్మించిన చీటర్స్టెలీగ్రామ్గ్రూప్లో చేర్చుకున్నారు. మొదట చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టించి లాభాలు ఇచ్చారు. తర్వాత పెద్ద మొత్తం పెడితే ఎక్కువ డబ్బులొస్తాయని ఆశ చూపారు. ఇది నమ్మిన ఆమె ఫేక్వెబ్సైట్లోని వాలెట్లో1.60 లక్షలు ఉంచింది. చివరకు వాటిని విత్డ్రా చేసుకోవడానికి వీలులేకుండా చేసి కొట్టేశారు.
గత ఏడాది అతి పెద్ద మోసం
స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ వృద్ధుడి నుంచి రూ.13.26 కోట్లను సైబర్నేరస్తులు కొల్లగొట్టారు. ఇది గత ఏడాది సెప్టెంబర్లో జరగ్గా ఇదే తెలంగాణలో అతిపెద్ద సైబర్ క్రైమ్గా నమోదైంది. హైదరాబాద్కు చెందిన రిటైర్డ్ఎంప్లాయ్ వాట్సాప్కు ఆన్లైన్స్టాక్ బ్రోకింగ్ చిట్కాల పేరిట మెసేజ్ వచ్చింది. గతంలో బాధితుడు షేర్లలో కొంత లాభాలు పొంది ఉండడంతో వాటిని నమ్మాడు. దీంతో అతడిని పలు కంపెనీల పేరుతో లింక్లు పంపి, వాట్సాప్ గ్రూప్ లో చేర్చారు.
ఆ గ్రూప్లో వచ్చిన కంపెనీ వెబ్సైట్ల లింక్లు నకిలీ యూఆర్ఎల్స్ అని బాధితుడు గ్రహించక పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాడు. దీంతో నేరగాళ్లు పలు బ్యాంకు ఖాతాల నంబర్లను పంపించి నగదు బదిలీ చేయించుకున్నారు. షేర్లలో పెట్టుబడికి తొలుత లాభాలు చూపించి ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో సైబర్ నేరస్తులను పూర్తిగా నమ్మి ఏకంగా రూ.13.26 కోట్లు బదిలీ చేశాడు. తర్వాత సైబర్నేరగాళ్లు ఆ డబ్బును కాజేశారు.
సైబర్ క్రైమ్ స్పెషల్ ఫోకస్..అయినా...
ఆన్లైన్ఇన్వెస్ట్మెంట్ఫ్రాడ్స్మోసాల్లో ఎక్కువ డబ్బులు పోతుండడంతో సైబర్క్రైమ్పోలీసులు దృష్టి పెట్టి నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెడుతున్నారు. అయినా ఈ తరహా నేరాలు తగ్గడం లేదు. 2024లో 354 సైబర్ క్రైమ్ కేసులను ఛేదించి, 300 మంది నేరస్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీపీ సి.వి. ఆనంద్ చెప్పారు.
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ పోలీసులు ఐదు స్పెషలైజ్డ్ టీమ్స్ఏర్పాటు చేసి 23 మంది సైబర్ఫ్రాడ్స్ను అరెస్ట్చేశారు. మార్చిలో 54 మంది బాధితులకు రూ.3.28 కోట్లు తిరిగి అందించారు. ఇటీవలే ఓ యాప్లో ఇన్వెస్ట్ చేయాలని నమ్మించి సుమారు రూ. 70 కోట్ల వరకూ కొల్లగొట్టగా ఇద్దరు సైబర్నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో కూడా 52 ఏండ్ల ప్రైవేట్ ఉద్యోగి ‘Lazardoosvip.Top’ అనే ప్లాట్ఫామ్లో రూ.1.22 కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి రూ.1.05 కోట్లు రికవరీ చేసి బాధితుడికి అందజేశారు. ఇలాంటి సంఘటనలు నగరంలో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ, ఫారెక్స్ ట్రేడింగ్ వంటి పేర్లతోనే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని సైబర్క్రైమ్పోలీసులు చెప్తున్నారు.
అలర్ట్గా ఉంటే సేఫ్..
సైబర్ఫ్రాడ్స్కు సంబంధించి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ఫ్రాడ్స్విషయంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్, తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సంయుక్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అధిక లాభాలు వాగ్దానం చేసే స్కీమ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ధారా కవిత సూచిస్తున్నారు. సైబర్ క్రైమ్జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటున్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ -జీరో ఎఫ్ఐఆర్ను ప్రవేశపెట్టిందని, ఈ విధానం త్వరలో అందుబాటులోకి రాబోతుందన్నారు. దీని ద్వారా రూ.10 లక్షలకు మించిన సైబర్ క్రైమ్ను ఆన్లైన్లో ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేస్తే.. ఎఫ్ఐఆర్ఫైల్ అవుతుందంటున్నారు.
జాగ్రత్తలు ఇలా
ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్లు సెబీ, ఆర్బీఐ ఆమోదం పొందినవని నిర్ధారించుకోవాలి.
ఓటీపీలు , సీవీవీ ఎవరికీ షేర్ చేయొద్దు.
ఎస్ఎంఎస్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్డౌన్లోడ్ చేయొద్దు. వీటితో మీ ఫోన్ను హ్యాక్చేస్తారు సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి
60 లక్షలు కొట్టేశారు!
బషీర్బాగ్ : ఆన్లైన్ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్పేరిట ఓ బిజినెస్ మ్యాన్ ను సైబర్ చీటర్స్ మోసగించారు. సికింద్రాబాద్ కు చెందిన 40 ఏండ్ల వ్యాపారికి ఏప్రిల్ 4న ఇన్వెస్ట్చేస్తే అధిక లాభాలు వస్తాయంటూ ఉన్న ఒక పోస్ట్ చూశాడు. అతడి వివరాలతో పాటు మొబైల్ నంబర్ఇచ్చిన కాసేపటికే G-6 నువామా వెల్త్ గ్రూప్ పేరిట వాట్సాప్ మెసేజ్ వచ్చింది. దాని ద్వారా వెబ్ అప్లికేషన్ లో ఆన్లైన్ట్రేడింగ్ లో జాయిన్ అవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత ట్రేడింగ్ వెబ్ పోర్టల్ ద్వారా సైన్ అప్ అయ్యాడు. బాధితుడికి సైబర్క్రిమినల్స్ఐపీవో అధిక లాభాలు వచ్చే పెట్టుబడులను సూచించారు.
స్కామర్ల మాటలను నమ్మిన బాధితుడు ట్యాంక్ ఆఫ్ ఇంజనీర్స్ , అరుణ ఆర్గానిక్స్ లిమిటెడ్ , వర్చువల్ గెలాక్సీ ఇన్ఫో టెక్ లలో సుమారు రూ.60 లక్షల వరకు ఇన్వెస్ట్చేశాడు. ఆన్లైన్ట్రేడింగ్ పోర్టల్ లో అధిక లాభాలు వచ్చాయని చెప్తూ రూ.3 కోట్ల వరకు ఉన్నట్లు చూపించారు. అందులో నుంచి రూ. 56 లక్షలు ఉపసంహరించుకోడానికి ట్రై చేయగా స్కామర్స్ రిజెక్ట్ చేశారు. డబ్బులు తీసుకోవాలంటే మొత్తం నగదుపై 20 శాతం కమిషన్ రూ. 59 లక్షలు చెల్లించాలని సూచించారు.
ఈ కమిషన్ ను నిల్వ ఉన్న డబ్బుల నుంచి కట్ చేసుకోవాలని బాధితుడు కోరాడు. పలు మార్లు విజ్ఞప్తి చేసినా స్కామర్స్నుంచి అదే సమాధానం రావడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 61,52,700 పోగొట్టుకున్నానని బాధితుడు ఫిర్యాదు చేశాడని హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.