ఒప్పో ఎఫ్33 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్లో విడుదల చేసింది. ఇందులో ఎఫ్33 ప్రో 5జీ, ఎఫ్33 5జీ మోడళ్లు ఉన్నాయి. ఈ ఫోన్లలో 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. వంద డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో గ్రూప్ సెల్ఫీలు తీసుకోవచ్చు.
7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్, ఐపీ69కే రేటింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ల సొంతం. ధరలు రూ.32 వేల నుంచి మొదలవుతాయి. ఈ నెల 23 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.

