‘విశ్వక్ సేన్’ కోసం రామ్ చరణ్ తేజ్

‘విశ్వక్ సేన్’ కోసం రామ్ చరణ్ తేజ్

టాలీవుడ్ యంగ్ హీరో ‘విశ్వక్ సేన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రాజమండ్రిలోని మంజీరా కన్వెన్షన్ సెంటర్ లో అక్టోబర్ 16వ తేదీన ఈవెంట్ జరగబోతోంది. ముఖ్య అతిథిగా మ్యాన్ ఆఫ్ మాసెస్, మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ హాజరు కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ఆతురతగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో సూప‌ర్ హిట్టయిన ‘ఓమై క‌డువ‌లే’ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కింది.

అశ్వత్ మ‌రిముత్తు ఈ రీమేక్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. విశ్వక్ సేన్ సరసన బాలీవుడ్ భామ ‘మిథిలా పాల్కర్’ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుండగా ‘ఆశా భట్’ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో లవ్ గాడ్ గా విక్టరీ ‘వెంకటేష్’ స్పెషల్ రోల్ పోషిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. లియన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.