ముషీరాబాద్, వెలుగు : ఓయూ జేఏసీ నేత, జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావు గౌడ్ గురవారం కాంగ్రెస్పార్టీలో చేరారు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రామారావు గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్పార్టీ విధానాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తానని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
తన చేరికకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, పీసీసీ కార్యదర్శి మాదు సత్యంకు కృతజ్ఞతలు తెలిపారు.