బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలని ఓయూలో స్టూడెంట్ల నిరాహార దీక్ష

బాల్క సుమన్ క్షమాపణలు చెప్పాలని ఓయూలో స్టూడెంట్ల నిరాహార దీక్ష
  • ఓయూలో స్టూడెంట్ల నిరాహార దీక్ష

ఓయూ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఓయూలో విద్యార్థులు నిరాహార దీక్ష చేపట్టారు. బాల్క సుమన్ తక్షణమే క్షమాపణలు  చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఆస్తులపై ప్రభుత్వం విచారణ చేయించాలని కోరారు.

ఈ నిరహార దీక్షలో విద్యార్థులు నగేష్, నర్సింహా రెడ్డి,  శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎంకు క్షమాపణలు చెప్పాకే నకిరేకల్​కు రావాలిబీఆర్​ఎస్ ​నకిరేకల్ ఇన్​చార్జిగా నియమితులైన బాల్కసుమన్ సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన తర్వాతే అక్కడ అడుగు పెట్టాలని కాంగ్రెస్​ నాయకులు వలిగొండ నర్సింహా హెచ్చరించారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్​కు క్షమాపణలు చెప్పకుంటే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించే సభను అడ్డుకుంటామన్నారు.