
- రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య
బషీర్బాగ్, వెలుగు: బీసీల సమస్యలపై గొంతెత్తుతున్న తనపై కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 42 శాతం రిజర్వేషన్ల అమలు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తనకు పదవుల కంటే, బీసీల హక్కుల సాధనే ముఖ్యమన్నారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లపై జీవో జారీ చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లులను రాజ్యాంగంలో చేర్చేలా ఒత్తిడి తెస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు జి.అనంతయ్య, జిల్లపల్లి అంజి, వేముల రామకృష్ణ, మధుసూదన్, పగిళ్ల సతీశ్, మోడీ రామ్ దేవ్, నిఖిల్ పాటిల్, కె.శివకుమార్, సి.మణికంఠ, కె.లింగం ముదిరాజ్, రవియాదవ్, మురళి పాల్గొన్నారు.