సిబ్బందిని కట్టేసి పట్టపగలే 30 కిలోల బంగారం దోపిడీ

సిబ్బందిని కట్టేసి పట్టపగలే 30 కిలోల బంగారం దోపిడీ

పంజాబ్ లో గోల్డ్ లోన్ సంస్థలో భారీ దోపిడీ జరిగింది. లూధియానాలో ఉన్న ఇండియా ఇన్ఫోలైన్ ఫైనాన్స్ లిమిటెడ్(IIFL) గోల్డ్ లోన్ సంస్థ బ్రాంచిలో ముసుగులతో ప్రవేశించిన ముగ్గురు దొంగలు సిబ్బందిని బెదిరించి భారీగా బంగారం దోచుకెళ్లారు
లూధియానాలోని గిల్ రోడ్డులో ఉన్న IIFL బ్రాంచి  దగ్గరకు మధ్యాహ్నం ఓ కారు వచ్చింది. అందులోని ఐదుగురిలో ఒకరు కారులోనే ఉండగా, మరో నలుగురు గోల్డ్ లోన్ ఆఫీసులోకి వెళ్లారు. సిబ్బందిని బెదిరించి తాళ్లతో కట్టేశారు. వారినుంచి బంగారం దాచిన గది తాళాలు తీసుకుని అందులో ఉన్న 30 కిలోల బంగారు నగలు దోచుకున్నారు.

కేవలం 20 నిమిషాల్లో వచ్చిన పని పూర్తి చేసుకున్న దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. వారు వెళ్లిన తర్వాత కాసేపటికి తేరుకున్న IIFL సిబ్బంది అలారం మోగించారు. దోపిడీ జరిగిన సమయంలో IIFL భద్రతా సిబ్బంది అక్కడ లేదు. దోపిడీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.