దేశంలో 40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్

దేశంలో 40 కోట్ల మార్కును దాటిన వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్ విషయంలో ఇండియా మరో మైలురాయిని దాటింది. టీకా పంపిణీలో 40 కోట్ల మార్కును భారత్ అధిగమించింది. శనివారం ఇచ్చిన 46.38 లక్షల డోసులతో కలిపి ఈ మార్కును చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం 21.18 లక్షల మంది టీకా తొలి డోసు తీసుకోగా.. 2.33 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు. దీంతో 40.49 కోట్ల డోసుల టీకా ఇచ్చినట్లయింది.