హైదరాబాద్లో ఒక్కరోజే దాదాపు రూ.2 కోట్లు స్వాధీనం

హైదరాబాద్లో ఒక్కరోజే దాదాపు   రూ.2 కోట్లు స్వాధీనం

లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది.  వాహనాల్లో అక్రమంగా  డబ్బు తరలిస్తున్న  వారిని పోలీసులు ఎక్కడిక్కడక పట్టుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఏప్రిల్ 29 న ఒక్కరోజే హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో దాదాపు రెండు కోట్లు పట్టుకున్నారు ఎస్ వోటీ పోలీసులు. సైబరాబాద్ SOT టీమ్స్ తమ  సిబ్బందితో  కలిసి  8 ప్రదేశాలలో  కోటి 96 లక్షల 70 వేల324 రూపాయలు పట్టుకున్నారు.

ఎక్కడెక్కడ ఎంత నగదు అంటే?

  • బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో   నగదు రూ.74లక్షల 7 వేల 791 -స్వాధీనం
  • కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో-  నగదు రూ. 34లక్షలు -
  • మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  నగదు రూ. 21లక్షల74 వేల520
  • చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు రూ.19లక్షల 26 వేల405
  •  రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో రూ. 15లక్షల49 వేల 848
  • నార్సింగ్ పీఎస్ పరిధిలో రూ. 11లక్షల63 వేల 560
  •  బాలానగర్  పరిధిలో రూ. 5లక్షల48 వేల200
  •  మోకిల పోలీస్ స్టేషన్  పరిధి లో ప్రైవేట్ వ్యక్తి  కారులో  రూ. 15లక్షలు