లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. వాహనాల్లో అక్రమంగా డబ్బు తరలిస్తున్న వారిని పోలీసులు ఎక్కడిక్కడక పట్టుకుని స్వాధీనం చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ఏప్రిల్ 29 న ఒక్కరోజే హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో దాదాపు రెండు కోట్లు పట్టుకున్నారు ఎస్ వోటీ పోలీసులు. సైబరాబాద్ SOT టీమ్స్ తమ సిబ్బందితో కలిసి 8 ప్రదేశాలలో కోటి 96 లక్షల 70 వేల324 రూపాయలు పట్టుకున్నారు.
ఎక్కడెక్కడ ఎంత నగదు అంటే?
- బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు రూ.74లక్షల 7 వేల 791 -స్వాధీనం
- కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో- నగదు రూ. 34లక్షలు -
- మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు రూ. 21లక్షల74 వేల520
- చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు రూ.19లక్షల 26 వేల405
- రాజేంద్ర నగర్ పీఎస్ పరిధిలో రూ. 15లక్షల49 వేల 848
- నార్సింగ్ పీఎస్ పరిధిలో రూ. 11లక్షల63 వేల 560
- బాలానగర్ పరిధిలో రూ. 5లక్షల48 వేల200
- మోకిల పోలీస్ స్టేషన్ పరిధి లో ప్రైవేట్ వ్యక్తి కారులో రూ. 15లక్షలు