సర్కార్‌‌‌ను నడుపుతున్నారా లేదా సర్కస్‌‌నా?

సర్కార్‌‌‌ను నడుపుతున్నారా లేదా సర్కస్‌‌నా?

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ విరుచుకుపడ్డారు. అన్ని రకాల పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ నిన్న కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తగా.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఉదయం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తొందరపడి తీసుకున్నారని, వీటిని అమలు చేయబోవడం లేదని ఆమె ఓ ప్రకటనలో వెల్లడించారు. దీనిపై ప్రియాంక సీరియస్ అయ్యారు. ఇదో ఎన్నికల స్టంట్ అని ఫైర్ అయ్యారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడంతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కేంద్రం ఇలాంటి డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక సర్కస్‌‌నా అంటూ ప్రియాంక ప్రశ్నించారు.