IPL 2023: సిరాజ్‌ కొత్త ఇంట్లో ఆర్సీబీ ప్లేయర్స్ సందడి

IPL 2023: సిరాజ్‌ కొత్త ఇంట్లో ఆర్సీబీ ప్లేయర్స్ సందడి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో కీలక పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సిద్ధమైంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఉప్పల్ వేదికగా మే 18వ తేదీన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తో బెంగళూరు జట్టు తలపడనుంది. ఇప్పటికే ఆర్సీబీ ప్లేయర్స్ హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే.. డుప్లేసిస్ సేన ప్రాక్టీస్ లో మునిగిపోయింది. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు ఆ టీమ్ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కొత్త ఇంటికి వచ్చి సందడి చేశారు.

మహ్మద్ సిరాజ్ ఇటీవలే ఫిల్మ్ నగర్ లో కొత్త ఇంటిని నిర్మించాడు. తన నూతన గృహ ప్రవేశానికి విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ తో పాటు సహాచర ఆటగాళ్లను సిరాజ్ ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఆటగాళ్లు సిరాజ్ కొత్త ఇంటిని సందర్శించారు. విరాట్ కోహ్లీతో పాటు అనుష్క శర్మ కూడా సిరాజ్ కొత్త ఇంటిని సందర్శించారు. 

ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం చాలా ముఖ్యం. ఇప్పటి వరకు ఈ సంవత్సరం టోర్నమెంట్ లో 12 మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ.. కేవలం 6 మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఆర్సీబీ టీమ్ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశం ఉంది.