ఎంతోమంది వీరులకు పుట్టినిల్లు నల్గొండ

ఎంతోమంది వీరులకు పుట్టినిల్లు నల్గొండ

నల్గొండ అర్బన్, వెలుగు : ఎంతోమంది వీరులకు పుట్టినిల్లు, పవిత్ర భూమి నల్గొండ అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఆదివారం భారీ శోభాయాత్ర నిర్వహించారు. 

నల్గొండలోని రామగిరి రామాలయం నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేస్తూ.. హిందువులను అణిచివేస్తుందని విమర్శించారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేవారిని ఆదరించాలని కోరారు.