రావల్పిండి: సొంతగడ్డపై ఇంగ్లండ్తో తొలి టెస్టులో పాకిస్తాన్ 71 రన్స్ తేడాతో ఓడిపోయింది. సోమవారం ముగిసిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఇచ్చిన 343 టార్గెట్ ఛేజింగ్లో 80/2 ఆట కొనసాగించిన పాక్ రెండో ఇన్నింగ్స్లో 268 వద్ద ఆలౌటైంది. సౌద్ షకీల్ (76) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ (4/36), ఒలీ రాబిన్సన్ (4/50) సత్తా చాటారు.
తొలి ఇన్నింగ్స్లో 657 రన్స్ చేసిన ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్ను 264/7 వద్ద డిక్లేర్ చేయగా.. పాక్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 579 రన్స్ చేసింది. నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి ఈ టెస్టులో 1768 రన్స్ వచ్చాయి. దాంతో, ఈ పోరు అత్యధిక రన్స్ వచ్చిన టెస్టు (ఐదు రోజుల)గా రికార్డు సృష్టించింది.