ఇండియా దెబ్బ మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి ఇంకా కోలుకోని పాక్

ఇండియా దెబ్బ మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి ఇంకా కోలుకోని పాక్

న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్‎కు ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. భారత బలగాలు చేసిన ప్రతిదాడుల్లో పాక్‎లోని పలు ఎయిర్ బేస్‎లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. అందులో భోలారి ఎయిర్ బేస్ కూడా ఒకటి. ఆపరేషన్ సిందూర్ దాడుల్లో ఆ స్థావరంలోని హ్యాంగర్‎కు భారీగా నష్టం జరిగింది. ఆ హ్యాంగర్‎కు పాకిస్తాన్ రిపేర్లు చేస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

హ్యాంగర్ రూఫ్‎ను పూర్తిగా తొలగించి దానిపై టార్పాలిన్ కప్పారు. వాంటోర్ సంస్థకు చెందిన శాటిలైట్లు ఈ ఏడాది జనవరి 28న ఆ హ్యాంగర్  ఫొటోలు తీశాయి. దీంతో హ్యాంగర్‎ను పాక్ ఎయిర్ ఫోర్స్ పునర్నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని టార్పాలిన్‎తో కప్పినా కూడా ధ్వంసమైన మిగతా భాగం ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, పాక్‎కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్  స్ట్రాబ్ 2000 విమానాన్ని కూడా భారత బలగాలు ధ్వంసం చేశాయి. 

ఇక, డ్యామేజ్ అయిన ఇతర ఎయిర్ బేస్‎లలో కూడా రీకన్ స్ట్రక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ధ్వంసమైన భాగాలను తొలగించి కొత్త రూఫ్‎లు నిర్మిస్తున్నారు. శకలాలను పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. కాగా.. సుక్కూర్‎లోని మురీద్ ఎయిర్ బేస్  కూడా భారత బలగాల దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నది. అక్కడ కూడా రిపేర్  పనులు జరుగుతున్న దృశ్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దెబ్బతిన్న రూఫ్  బిల్డింగ్‎ను ఎర్రటి టార్పాలిన్ తో కప్పారు. ఇక, కీలక నూర్ ఖాన్ ఎయిర్ బేస్‎లోని కమాండ్  కంట్రోల్ కూడా డ్యామేజ్  అయింది.