పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకే డ్యూటీకి రండి

పంచాయతీ కార్యదర్శులు ఉదయం 7 గంటలకే డ్యూటీకి రండి

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శుల టైమింగ్​ను సర్కారు మార్చింది. ఉదయం 7 గంటలకే డ్యూటీకి రావాలని ఆర్డర్స్​ జారీచేసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు విధుల్లో ఉండాలని స్పష్టం చేసింది. రోజుకు రెండు పూటలా హాజరును ఆన్​లైన్ ద్వారా పంపించాలని ఆదేశించింది. సమ్మె విరమించిన తర్వాత కార్యదర్శులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఫిర్యాదులు రావడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.